Telugu News » Purandeswari: వైసీపీ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది: పురంధేశ్వరి

Purandeswari: వైసీపీ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది: పురంధేశ్వరి

పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

by Mano
daggubati purandeswari on modi birthday

బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూనే వైసీపీ(YCP) ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తోందన్న మాటను కూడా వైసీపీ ప్రభుత్వం దాస్తోందని ఆమె ధ్వజమెత్తారు.

daggubati purandeswari on modi birthday

తాజాగా పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కడియం మండలం బుర్రి లంక ఇసుక ర్యాంపులను ఆమె జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ఆగడాలకు కడియం నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మిషనరీతో తవ్వకాలు జరుగుతున్నాయని.. దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్‌తో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. కంపెనీ పేరు లేకుండా బిల్లులు ఉన్నాయని, ఢిల్లీలో ఉన్న వారి పేరుతో ఇక్కడ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారంటూ పురంధేశ్వరి ఆరోపించారు.

బుర్ర లంకలో ఇసుక ర్యాంపుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని పురంధేశ్వరి ఆరోపించారు. జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాంపును పరిశీలించామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. నాలుగు ఐదు కిలో మీటర్ల మేర లారీలు క్యూ లైన్‌లో ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు.

You may also like

Leave a Comment