Telugu News » Rajanna Sirisilla : ప్రాణాలు తీస్తున్న పోడు పై పోరు..ఎప్పటికీ తెగని భూముల పంచాయతీ..!!

Rajanna Sirisilla : ప్రాణాలు తీస్తున్న పోడు పై పోరు..ఎప్పటికీ తెగని భూముల పంచాయతీ..!!

రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla) జిల్లా ఎర్రగడ్డ (YerraGadda) తండాలో పొడు భూముల విషయంపై రైతుల (Farmers) మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. భూమి పట్టా ఒకరి పేరుపై ఉంటే.. మరొకరు ఆ భూమని కబ్జా చేశారని ఒకరిని ఒకరు పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు.

by Venu

ప్రత్యేక తెలంగాణ (Telangana) వస్తే పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోగా ఎక్కడో ఒక చోట గొడవలు జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఈ పోడు భూముల సమస్య రైతుల మధ్య నిప్పు రాజేసింది.

రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla) జిల్లా ఎర్రగడ్డ (YerraGadda) తండాలో పొడు భూముల విషయంపై రైతుల (Farmers) మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. భూమి పట్టా ఒకరి పేరుపై ఉంటే.. మరొకరు ఆ భూమని కబ్జా చేశారని ఒకరిని ఒకరు పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. తలలు పగిలి, రక్తం కారుతున్న కూడా కొట్టుకోవడం చూస్తుంటే సమస్య తీవ్రత అర్ధం అవుతోంది.

ఇక ఈ గొడవను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రక్షక భటులు వచ్చిన ఐ డోంట్ కేర్ అంటూ దాడి చేసుకొన్నారు రైతులు. ఈ దాడిలో భీమ్ జీ, చంద్రకాంత్ అనే రైతులకు తీవ్ర గాయాలవగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ తతంగం అంతా ఓ స్థానికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్త వైరల్ అయింది.

You may also like

Leave a Comment