Telugu News » Rani Rudrama Reddy: మంత్రి కేటీఆర్‌కు బిగ్‌షాక్.. అక్రమాలపై చార్జ్ షీట్..!

Rani Rudrama Reddy: మంత్రి కేటీఆర్‌కు బిగ్‌షాక్.. అక్రమాలపై చార్జ్ షీట్..!

సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి(Rani Rudrama Reddy) కేటీఆర్ అక్రమాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ‘రామ్ రామ్ రావు రావు’ పేరుతో కేటీఆర్ అక్రమాల చిట్టాలను మీడియా ముందుంచారు.

by Mano
Rani Rudrama Reddy: Big shock for Minister KTR.. Charge sheet on irregularities..!

ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ మంత్రి కేటీఆర్‌(KTR)కు బిగ్‌ షాక్ తగిలింది. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి(Rani Rudrama Reddy) కేటీఆర్ అక్రమాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ‘రామ్ రామ్ రావు రావు’ పేరుతో కేటీఆర్ అక్రమాల చిట్టాలను మీడియా ముందుంచారు. మండలానికి ఒక చిన్న దొరను తమ సామాజిక వర్గానికి చెందిన వారిని అపాయింట్ చేసి సంపదను కేటీఆర్ కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

Rani Rudrama Reddy: Big shock for Minister KTR.. Charge sheet on irregularities..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిరిసిల్లను కేటీఆర్ ఎంచుకోవడానికి కారణం ప్రజల మీద ప్రేమ కాదన్నారు. స్థానికంగా ఉన్న వేల కోట్ల విలువైన ఇసుక మొత్తాన్ని అక్రమంగా తోడుకుపోయారని ఆరోపించారు. నేరెళ్ల దళితులను చావగొట్టిన ద్రోహి కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ చిన్నమ్మ కొడుకు, ఎంపీ సంతోష్ వారి ముఠా కలిసి 15లారీలకు ఒకటే నెంబర్ పెట్టి రాత్రంతా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు.

సెస్‌లో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని అక్రమ దందా చేసిన వారే ప్రస్తుతం సెస్‌లో కీలక పదవుల్లో ఉన్నారన్నారు. ఒక్క వానకు సిరిసిల్ల కలెక్టరేట్ మునిగిపోయిందని.. చెరువు కబ్జా చేసి కలెక్టరేట్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్వా హబ్ పేరిట స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేటీఆర్ మోసం చేశారన్నారు.

ఇవన్నీ చేసినందుకు కేటీఆర్‌కు సిరిసిల్ల ప్రజలు ఓటేయ్యాలా? అని రాణి రుద్రమరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికీ బాధితులే జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. కేటీఆర్ చేతిలో ఉన్న 8 మంది దళారులు, బ్రోకర్లు బతుకమ్మ చీరల టెండర్లను తమ చేతుల్లోకి తీసుకున్నారన్నారు. అసలైన చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలతో లబ్ధి చేకూరడం లేదన్నారు.

You may also like

Leave a Comment