రేషన్కార్డు ఈ-కేవైసీ(Ration Card E-KYC) చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ముందుగా విధించిన గడువు ప్రకారం మరో మూడు రోజుల్లో (జనవరి 31) ముగియనుంది. రేషన్షాపుల్లో రెండు నెలలుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, కొన్ని రేషన్ షాపుల దగ్గర భారీ లైన్లు ఉండడంతో అప్డేట్(Update) చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది.
మూడు రోజుల సమయమే ఉండడంతో ఇంకా అప్డేట్ చేసుకోని వారు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి టెన్షన్ లేకుండా తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మరో నెలరోజుల పాటు అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75.76 శాతం మాత్రం రేషన్కార్డుదారులు మాత్రమే ఈ-కేవైసీ అప్డేట్ చేసుకున్నారు. మిగతావారు కూడా వెంటనే అప్డేట్ చేసుకునే విధంగా ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ-కేవైసీ గడువు పొడిగిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రకియను మొదలుపెట్టింది. రేషన్కార్డు అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ, వేలిముద్రలు సేకరిస్తారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే.