Telugu News » Revanth Reddy: రేవంత్‌రెడ్డి 65 టికెట్లను రూ.600కోట్లకు అమ్ముకున్నాడు: విద్యార్థి నేత విజయ్‌కుమార్

Revanth Reddy: రేవంత్‌రెడ్డి 65 టికెట్లను రూ.600కోట్లకు అమ్ముకున్నాడు: విద్యార్థి నేత విజయ్‌కుమార్

విద్యార్థి నేత కురవ విజయ్ ‌కుమార్ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లను రూ.600కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఆదివారం ఆయన తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌ను ముట్టడించారు.

by Mano
Revanth Reddy: Revanth Reddy sold 65 tickets for Rs.600 crore: Student leader Vijaykumar

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థి నేత కురవ విజయ్ ‌కుమార్ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లను రూ.600కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఆదివారం ఆయన తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌ను ముట్టడించారు. అనంతరం విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Revanth Reddy: Revanth Reddy sold 65 tickets for Rs.600 crore: Student leader Vijaykumar

రేవంత్‌రెడ్డి వసూళ్లపై ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కోట్ల రూపాయల వసూళ్లపై వెంటనే అధిష్ఠానం విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. రూ.600కోట్ల వసూళ్లపై ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

చంద్రబాబు అండ్‌కో కబంధహస్తాల నుంచి కాంగ్రెస్‌ను కాపాడాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని విమర్శించారు.  గద్వాల టికెట్‌ను రూ.10 కోట్ల క్యాష్‌, 5ఎకరాల భూమికి కొనుక్కున్నట్లు టికెట్‌ పొందిన సరితా తిరుపతయ్య బాహాటంగా చెప్పుకుంటున్నారని తెలిపారు.

 

You may also like

Leave a Comment