Telugu News » Road Accident : రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడ్డ మాజీ సీఎంలు.. !

Road Accident : రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడ్డ మాజీ సీఎంలు.. !

వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల నుంచి గుజరాత్‌ (Gujarat) మాజీ ముఖ్యమంత్రులు (Former CMS) విజయ్‌ రూపానీ (Vijay Rupani) సురేశ్‌ మెహతా (Suresh Mehta) త్రుటిలో బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీపీ ముంధ్వా తెలిపారు.

by Venu

రోడ్డు ప్రమాదాలు సామాన్యుల నుంచి సెలబ్రెటీ, రాజకీయ నేతల వరకి ప్రాణాంతకంగా మారుతున్నాయి. రోజురోజుకి ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి కాని తగ్గడం లేదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు మాజీ సీఎంలు కూడా రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు.

వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల నుంచి గుజరాత్‌ (Gujarat) మాజీ ముఖ్యమంత్రులు (Former CMS) విజయ్‌ రూపానీ (Vijay Rupani) సురేశ్‌ మెహతా (Suresh Mehta) త్రుటిలో బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీపీ ముంధ్వా తెలిపారు.

మరోవైపు మోర్బీ జిల్లా హల్వద్‌ పట్టణం సమీపంలో.. మాజీ సీఎం సురేశ్‌ మెహతా కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడనట్టు సమాచారం.. ఇక రాజ్‌కోట్‌ జాతీయ రహదారిపై.. విజయ్‌ రూపానీ కాన్వాయ్‌ అహ్మదాబాద్‌, ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సురేంద్ర నగర్ జిల్లా, లింబ్డి పట్టణం సమీపంలో రోడ్డు బైక్ తో క్రాస్ చేస్తున్న 50 ఏళ్ల ప్రభు థాకర్షి అనే వ్యక్తి ని.. మాజీ సీఎం కాన్వాయ్‌ తాకింది. దీంతో ఆ వ్యక్తి స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. కాగా గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందుస్తున్నట్టు అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment