Telugu News » Road Accident : తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!!

Road Accident : తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!!

స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్‌కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

by Venu
Road Accident: A van collided with a stationary lorry.. Three died..!

తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకొంది. ఆదివారం తెల్లవారుజూమున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.. సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీని, కారు వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టడంతో.. కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కాగా ఈ దారుణ ఘటన తెన్‌కాసి జిల్లాలో చోటు చేసుకొంది.

road accident

స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్‌కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులు నిన్న రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటుచేసుకొంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మందర్‌లో నిన్న రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment