Telugu News » SI Sirisha: ఎస్సై శిరీష భర్త మృతి…హత్యా? ఆత్మహత్యా?

SI Sirisha: ఎస్సై శిరీష భర్త మృతి…హత్యా? ఆత్మహత్యా?

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్ స్పెక్టరుగా శిరీష పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం శిరీష భర్త ఇంట్లోనే ఊరేసుకున్నారు.

by Prasanna
suicide

నందివాడ (Nandiwada) ఎస్సైగా పని చేస్తున్న శిరీష (SI Sirisha) భర్త అశోక్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. వీరిద్దరిది కులాంతర వివాహం. అశోక్ (Ashok) మృతిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

suicide

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్ స్పెక్టరుగా శిరీష పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం శిరీష భర్త ఇంట్లోనే ఊరేసుకున్నారు. దీనిని గుర్తించిన శిరీష, ఆమె బంధువులు వెంటనే అశోక్ ను గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

సాయంత్రం ఈ సంఘటన జరిగితే రాత్రి పది గంటలకు వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏలూరుకు చెందిన శిరిష, గుంటూరుకు చెందిన అశోక్ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ వేర్వేరు కులాలైనా కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. వీరిద్దరిని ఆదర్శ దంపతులనేవారని స్థానికులు చెప్తున్నారు.

మచిలీపట్నంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తున్న శిరీషకు నాలుగు నెలల క్రితం నందివాడకు ట్రాన్స్ ఫర్ అయ్యింది. దాంతో ఒక అద్దె ఇంట్లో శిరీష కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి ఏడాది వయసున్న పాప కూడా ఉంది.

అయితే అశోక్ ఎందుకు మరణించారనే విషయంపై క్లారిటీ లేదు. పైగా స్థానిక రాజకీయ నాయకులు ఈ కేసు విషయంలో రాజీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అశోక్ కుటుంబ సభ్యులు ఇది హత్యేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment