Telugu News » Software Company : ప్రముఖ ఐటీ కంపెనీపై తిరుగుబాటు చేసిన 5 వేల మంది ఉద్యోగులు..!

Software Company : ప్రముఖ ఐటీ కంపెనీపై తిరుగుబాటు చేసిన 5 వేల మంది ఉద్యోగులు..!

మరోవైపు ఏప్రిల్ నుంచి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి. లేదా, కస్టమర్లతో ఆన్‌సైట్‌లో వారానికి మూడు రోజుల పాటు పనిచేయాలనే కొత్త విధానాన్ని జనవరిలో ఎస్ఏపీ ప్రకటించింది.

by Venu

దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నో కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేశాయి. తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశించాయి.. ఇదే విధానాన్ని ఇప్పటికి కొన్ని కంపెనీలు అలాగే కొనసాగిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు ఈ విధానానికి స్వస్తి పలికాయి. అయితే తాజాగా వర్క్ ఫ్రం హోం విధానానికి ముగింపు పలుకుతున్న టెక్ కంపెనీలపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఐరోపా (Europe)లో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ (Software Company) ఎస్ఏపీ (SAP)పై తాజాగా 5 వేల మంది ఉద్యోగులు తిరుగుబాటు ప్రకటించారు. ఆఫీసుకు రమ్మని బలవంతం చేస్తే మరో జాబ్ చూసుకుంటామంటూ హెచ్చరికలు హెచ్చరించారు. ఇంతకాలం వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించిన కంపెనీ అకస్మాత్తుగా ఆఫీసులకు రమ్మంటూ ప్లేటు ఫిరాయించి మమ్మల్ని మోసం చేసిందని ఉద్యోగులు కంపెనీ అంతర్గత లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.

ఇంతకాలం వర్క్ ఫ్రం హోం (Work from home) కొనసాగిస్తామని చెప్పిన కంపెనీ ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు రమ్మనడం సహేతుకం కాదని ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూరోపియన్ వర్క్ కౌన్సిల్ పేర్కొంది. అయితే వర్క్ కౌన్సిల్ తీరును సంస్థ సీఈఓ కార్యాలయం ఖండించింది. వర్క్ ఫ్రం హోం విధానంతో సంస్థలో పని సంస్కృతి, టీంవర్క్ దెబ్బతింటాయని పేర్కొంది.

మరోవైపు ఏప్రిల్ నుంచి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి. లేదా, కస్టమర్లతో ఆన్‌సైట్‌లో వారానికి మూడు రోజుల పాటు పనిచేయాలనే కొత్త విధానాన్ని జనవరిలో ఎస్ఏపీ ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని ఒత్తిడి పెంచేశాయి. కంపెనీల ఆదేశాలను ధిక్కరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.

You may also like

Leave a Comment