Telugu News » Annamalai : గంగలో కలసిన తెలంగాణ సీఎం పరువు.. కవిత ముందే..?

Annamalai : గంగలో కలసిన తెలంగాణ సీఎం పరువు.. కవిత ముందే..?

తెలంగాణ నికర అప్పులు రూ.75 వేల కోట్లు అయితే.. ఇప్పుడు రూ.3.13 లక్షల కోట్లకు పెరిగాయని ఎద్దేవా చేశారు. కుమారుడు, మేనల్లుడు మంత్రులుగా, కుమార్తె ఎమ్మెల్సీ, బంధువు రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, కుటుంబ రాజకీయాలకు బీఆర్ఎస్ మోడల్‌గా మారిందని అన్నామలై దుయ్యబట్టారు.

by Venu

తమిళనాడు (Tamil Nadu) బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై (Annamalai) బీఆర్ఎస్ (BRS) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన సదస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ముందే సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డ అన్నామలై తెలంగాణ (Telangana)ను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.

తెలంగాణ నికర అప్పులు రూ.75 వేల కోట్లు అయితే.. ఇప్పుడు రూ.3.13 లక్షల కోట్లకు పెరిగాయని ఎద్దేవా చేశారు. కుమారుడు, మేనల్లుడు మంత్రులుగా, కుమార్తె ఎమ్మెల్సీ, బంధువు రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, కుటుంబ రాజకీయాలకు బీఆర్ఎస్ మోడల్‌గా మారిందని అన్నామలై దుయ్యబట్టారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేసీఆర్ ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

ఎందరో ప్రాణాలు అర్పించి, మరెందరో కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగిస్తుందని అన్నారు. కానీ బీజేపీ అలాంటిది కాదని, ఇక్కడి రాజకీయాల్లో వారసత్వాలు లేవని వెల్లడించారు. ఇది సామాన్యుల పార్టీ అని, ఎవరైనా వచ్చి దేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

You may also like

Leave a Comment