Telugu News » Telangana: మందుబాబులకు బిగ్‌షాక్.. వైన్స్‌ బంద్..!

Telangana: మందుబాబులకు బిగ్‌షాక్.. వైన్స్‌ బంద్..!

ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి.

by Mano
telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) నేపథ్యంలో పోలింగ్‌(polling)కు ఇంకా పదిరోజులే మిగులుంది. దీంతో బరిలో దిగిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని అమ్ముల పొదలోని వ్యూహాలను అమలు చేస్తున్నారు.

wines

ఈ క్రమంలో ఎన్నికల వేళ చిల్ అయిపోవచ్చని అనుకున్న మందుబాబులకు ఎన్నికల సంఘం అనూహ్యంగా షాకిచ్చింది. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి.

ఈ మేరకు అధికారులు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

మరోవైపు, తెలంగాణ ఎన్నికల వేళ ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment