Telugu News » Bakka Judson : బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇంకా ఆగమయ్యేది.. బక్క జడ్సన్..!!

Bakka Judson : బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇంకా ఆగమయ్యేది.. బక్క జడ్సన్..!!

అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతోందని బక్క జడ్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి హింసించే దొరల పాలనకు చరమ గీతం పాడి.. స్వేచ్ఛగా జీవించే హక్కుని తెలంగాణ ప్రజలు ఇప్పుడే పొందినట్టు బక్క జడ్సన్ పేర్కొన్నారు.. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు ఇంకా ఆగమయ్యేయని సంచలన వ్యాఖ్యలు చేశారు..

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంపై ఆనందం వ్యక్తం చేశారు పీసీసీ జనరల్ సెక్రటరీ (PCC General Secretary) బక్క జడ్సన్ Bakka Judson).. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 1200 మంది అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న బక్క జడ్సన్.. బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు..

ప్రజలు నమ్మి రాష్ట్రాన్ని అప్పగిస్తే.. అప్పులు చేసి నాశనం చేసిన ఘనుడు కేసీఆర్ (KCR)అని విమర్శించారు.. చివరికి అప్పు పుట్టకుంటే వరంగల్ సెంట్రల్ జైలును సైతం తాకట్టు పెట్టడానికి సైతం వెనకాడలేదని బక్క జడ్సన్ ఆరోపణలు చేశారు.. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ (BRS) నాయకులు చేసిన అక్రమాలపై అనేక కేసులు వేసి నిజాలను బయటికి తీసుకురావడంలో కాంగ్రెస్ కృషి చేసినట్టు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రజల తిరుగుబాటు వల్లనే కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిందని బక్క జడ్సన్ వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు పని చేయడంలో విఫలమైందని తెలిపిన బక్క జడ్సన్.. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థుల వాయిస్ చట్టసభలలో వినిపించేందుకు తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.

అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతోందని బక్క జడ్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి హింసించే దొరల పాలనకు చరమ గీతం పాడి.. స్వేచ్ఛగా జీవించే హక్కుని తెలంగాణ ప్రజలు ఇప్పుడే పొందినట్టు బక్క జడ్సన్ పేర్కొన్నారు.. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు ఇంకా ఆగమయ్యేయని సంచలన వ్యాఖ్యలు చేశారు..

You may also like

Leave a Comment