Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth-Reddy)పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ మధ్య తీవ్ర స్థాయిలో మండిపడటం కనిపిస్తూనే ఉంది.. మరోవైపు కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లిలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్.. కాంగ్రెస్ (Congress)పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో మాత్రమే కీలక హామీలు ఇస్తున్న కాంగ్రెస్.. రాజస్థాన్లో కూడా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తించాలని అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తెలిపారు. మైనార్టీ డిక్లరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్లో కూడా మైనార్టీ డిక్లరేషన్ లేదని..అక్కడ ఎందుకు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన చేయలేదని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ తన కుటంబానికి చెందిన సీటునే కాపాడుకోలేక పోతున్నాడాని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మరోవైపు తెలంగాణలో మంచి స్కీమ్లు ఉన్నాయని, అవన్నీ తమ ప్రజలకు అందుతున్నట్లు ఓవైసీ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న షాదీ ముబారక్ (Shaadi Mubarak)..కళ్యాణ లక్ష్మీ (Kalyana Lakshmi) లాంటి స్కీమ్లు, ఆసర పింఛన్లు ఇక్కడి ప్రజలకు ఉపయోగంగా ఉన్నట్టు ఓవైసీ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మరో 66 అశాలతో కూడిన మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్.. మరో కీలక హామీ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఈ క్రమంలో టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth-Reddy) మరో కీలక హామీ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) నుంచి జగిత్యాలకు వెళ్తున్న కవిత.. ఆర్మూర్లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు ఆరబెట్టిన వరి ధాన్యపు రాశులను చూసి మురిసిపోయారు. వెంటనే ఆ దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించి, ట్విట్టర్లో షేర్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణ అప్పుడు ఎట్లుంది.. ఇప్పుడు ఎట్లైందని ట్విట్టర్ కవిత పేర్కొన్నారు.

బస్తీ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇచ్చే దమ్ము కేసీఆర్ (KCR)కి లేదు కానీ గుడిసెలు వేసుకున్న వారి దగ్గర భూములు లాక్కొని పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారని ఈటల మండిపడ్డారు.. ఆనాటి ప్రభుత్వాలు ఎల్లమ్మబండలో ఉన్న 250 ఎకరాలలో 160 ఎకరాలు పేదలకు పంచాయి. మిగిలిన 92 ఎకరాలలో దేశ్ పాండే అనేవాడు రేకులు పాతే ప్రయత్నం చేసిండు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నేను రేకులు పీకేసి ఇది ప్రభుత్వ భూమి నువ్వు ఎవడ్రా అంటూ అతన్ని అడ్డుకున్నానని ఈటల తెలిపారు.