Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపందుకోగా అభ్యర్థులు ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలువురు నేతలపై ఫిర్యాదులు కూడా ఇచ్చాయి.
తాజాగా మంత్రి సత్యవతి రాఠోడ్(minister satyavathi Rathod)పై కూడా ఇలాంటి ఫిర్యాదే వచ్చింది. దీంతో గూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని కొంగరగిద్దలో మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్కు మద్దతుగా ప్రచారం చేశారు.
మంత్రికి స్థానిక మహిళలు మేళతాళాలు, డప్పచప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. అయితే మంత్రి.. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను ఉంచారు. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఆమె డబ్బు ఇచ్చారంటూ ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంత్రి సత్యవతి రాఠోడ్పై కేసు నమోదు చేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ హారతి పళ్లెంలో డబ్బులు వేస్తే కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ (Narsapur)లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో (Public blessing meeting) బుల్లెట్లు కలకలం సృష్టించాయి. సభకు హాజరైన అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లు (Bullets) స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. కాగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు రాజాసింగ్ కు ఉన్న సమస్య నియోజక వర్గంలో మరోసారి సత్తాచాటి.. తన చరిష్మా తగ్గలేదని నిరూపించాలి.. ఈ లక్ష్యంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజాసింగ్.. సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించినవని తెలిపిన రాజా సింగ్.. తనను మోసం చేయాలని చూస్తున్న వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని మాస్ వార్నింగ్ ఇచ్చారు..
మరోవైపు కొన్నాళ్లుగా బీజేపీ (BJP) అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి (vijaya Shanthi)..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదీగాక బండి సంజయ్ (Bandi Sanjay)ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి అప్పగించడాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు విజయశాంతి. ఇటీవల ప్రధాని మోడీ, అమిత్ షా బహిరంగ సభలకు సైతం హాజరుకాలేదు రాములమ్మ..
