Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
మానవ తప్పిదాల వల్ల ప్రకృతి ఇప్పటికే నాశనం అయ్యిందని పర్యావరణ వేత్తలు.. ప్రకృతి ప్రేమికులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య ఇలాగే కొనసాగితే భావితారాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. అయినా స్వలాభం, స్వార్థం కోసం ప్రకృతి గురించి ఆలోచించడం మానేశాడు మనిషి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగడం ఆందోళన కలిగిస్తుంది.
దీపావళి తర్వాత ఇక్కడ కాలుష్యం తారాస్థాయికి చేరింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగమంచు పేరుకుపోయి ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది. దీంతో ప్రజలు శ్వాస తీసుకొనేందుకు ఇబ్బందులుపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వంతో పాటు వివిధ ఏజెన్సీలు చలికాలంలో వాయు కాలుష్యాన్ని (Air Pollution) నియంత్రించడంలో విఫలమవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ (Air quality) చాలా పూర్ గా నమోదవుతుంది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు గాలి నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అయితే, శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ప్రకారం..
బుధవారం ఉత్తర దిశ నుంచి గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి వేగం తగ్గడంతో కాలుష్యం పెరిగింది. గురువారం తూర్పు దిశ నుంచి గాలులు వచే అవకాశాలున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ పేర్కొంది. ఉదయం సమయంలో భారీగా పొగమంచు పేరుకుపోతుందని అంచనా వేసింది. శుక్రవారం ఉత్తర, వాయువ్య దిశల నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని ఐఐటీఎం పేర్కొంది.



మరో సారి వీరి మధ్య నిప్పు రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో వివేక్ వెంకట స్వామి డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. వివేక్ పక్కన ఉన్న వారి అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తూ.. చెన్నూరు నియోజకవర్గం ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని తెలిపారు.
మరోవైపు ఎర్రుపాలెం మండలం తెల్లపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం (Election-Campaign) నిర్వహించిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తన నియోజక వర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్థిని మరచిన బీఆర్ఎస్ కు బుద్ధి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ (KCR)ని గద్దె దింపాలని ధర్వేశిపురం నుంచి మంచినీళ్ల బావి వరకు కోటి రూపాయలతో రోడ్డు వేయించానని పేర్కొన్నారు..


