తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సభలు, సమావేశాలతో విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ (BRS) నేత,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కాంగ్రెస్, బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో.. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను చూసి గుబులు మొదలైందని విమర్శించారు. ఏం చేయాలో అర్థం గాక రెండు పార్టీల నేతలు మతితప్పినట్టుగా మాట్లాడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రకటించిన గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ (BJP) ఆరితేరిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా ఉందన్న కవిత.. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా రూపొందించారని తెలిపారు. మరోవైపు రెండు పార్టీలు గ్యారెంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ను ఉద్దేశించి.. ఆరు దశాబ్ధాల పాటూ తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం క్షమాపణలు చెప్పలేరా అని ప్రశ్నించారు.
వందలాది తల్లుల కడుపుకోత పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి గుర్తుకు రాకపోవడం బాధాకరం అవి వెల్లడించిన కవిత అమరవీరుల స్థూపం వద్ద మోకరిల్లినా కూడా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత ఘాటుగా విమర్శించారు.

ఇప్పుడు రాజాసింగ్ కు ఉన్న సమస్య నియోజక వర్గంలో మరోసారి సత్తాచాటి.. తన చరిష్మా తగ్గలేదని నిరూపించాలి.. ఈ లక్ష్యంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజాసింగ్.. సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించినవని తెలిపిన రాజా సింగ్.. తనను మోసం చేయాలని చూస్తున్న వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని మాస్ వార్నింగ్ ఇచ్చారు..
మరోవైపు కొన్నాళ్లుగా బీజేపీ (BJP) అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి (vijaya Shanthi)..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదీగాక బండి సంజయ్ (Bandi Sanjay)ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి అప్పగించడాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు విజయశాంతి. ఇటీవల ప్రధాని మోడీ, అమిత్ షా బహిరంగ సభలకు సైతం హాజరుకాలేదు రాములమ్మ..




