Telugu News » VIRAL : మహారాష్ట్రలో తీవ్ర విషాదం.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన పిల్లి..!

VIRAL : మహారాష్ట్రలో తీవ్ర విషాదం.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన పిల్లి..!

మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు(Five People died) పోవడానికి ఓ పిల్లి కారణమైంది.దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణం అహ్మద్ నగర్లోని వాడ్కి గ్రామంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.

by Sai
Tragedy in Maharashtra.. a cat caused the death of five people..!

మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు(Five People died) పోవడానికి ఓ పిల్లి కారణమైంది.దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణం అహ్మద్ నగర్లోని వాడ్కి గ్రామంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Tragedy in Maharashtra.. a cat caused the death of five people..!

పోలీసుల కథనం ప్రకారం..వాడ్కి గ్రామంలో ఓ పెద్ద పాడుబడిన బావి ఉంది. అందులో అనుకోకుండా ఓ పిల్లి(Cat) కూన పడిపోయింది. అది గమనించిన గ్రామస్తులు ఆ పిల్లి కూనను రక్షించడానికి అనేక మార్గాలను వెతికారు. చివరకు ఆరుగురు యువకులు పిల్లిని రక్షించేందుకు ఒక్కొక్కరిగా బావిలో దిగారు.

అయితే, వెళ్లిన ఆరుగురిలో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాలేదు. తాడుతో కిందకు దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఇంతకు ఆ బావిలో ఏముంది? ఏం జరిగింది? అనేది అందరికీ మిస్టరీగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు వెలికి తీయించారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం..ఆ ఐదుగురు వ్యక్తులు విషపు వాయువును పీల్చడం వల్లే మరణించినట్లు తేలింది. గతంలో ఆ పాడు బడిన బావిలో బయోగ్యాస్ కోసం జంతువుల వ్యర్థ్యాలతో నిల్వ చేయబడి ఉందని తెలిసింది. ఈ గ్యాస్ పీల్చడం వల్లే వారంతా చనిపోయారని గ్రామస్తులు కూడా నమ్ముతున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ధనుంజయ్ జాదవ్ తెలిపారు. ప్రాణాలతో బయటపడిన విజయ్ మాణిక్ కాలే(35)ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

 

You may also like

Leave a Comment