Telugu News » Tet Exam: పరీక్ష కోసం పరుగులు పెట్టి..ప్రాణాలు విడిచిన నిండు గర్భిణీ!

Tet Exam: పరీక్ష కోసం పరుగులు పెట్టి..ప్రాణాలు విడిచిన నిండు గర్భిణీ!

8 నెలల గర్భిణి అయినా రాత్రింబవళ్లు చదివి ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమైందని, తీరా పరీక్ష రాయడానికి వస్తే ప్రాణాలే పోయాయంటూ ఆమె భర్త కంటతడి పెట్టుకున్నాడు

by Sai
ts tet exam hall pregnent woman incident

సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని టెట్‌ (Tet) పరీక్ష కేంద్రంలో విషాదకరమైన సంఘటన జరిగింది. టెట్ రాసేందుకు వచ్చిన ఓ 8 నెలల గర్భిణి పరీక్ష హాలులోనే విగతజీవిగా మారింది. పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలనే తొందరలో పరిగెత్తుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. పరీక్ష కేంద్రంలోనే కళ్లు తిరిగి కుప్పకూలింది.

ts tet exam hall pregnent woman incident

ఈ ఘటనతో పరీక్ష కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రాసేందుకు లక్షలాది మంది అభ్యర్థులు ఎగ్జామ్ హాల్‏కు చేరుకున్నారు. పటాన్‎చెరు మండలం ఇస్నాపూర్ నుంచి రాధిక అనే 8 నెలల గర్భిణి పరీక్ష రాసేందుకు వచ్చింది.

పరీక్షకు ఎక్కడ ఆలస్యం అవుతుందో అనే కంగారుతో వేగంగా పరిగెత్తుకుంటూ సెంటర్‏లోకి వెళ్లింది. అంతే ఒక్కసారిగా బీపీ పెరిగిపోయి హాల్‎లో కుప్పకూలిపోయింది. పరిస్థితి గమనించిన ఇన్విజిలేటర్ మహిళ కుటుంబానికి సమాచారం అందించారు. రాధికను ఆమె భర్త అరుణ్ వెంటనే స్థానికంగా ఉన్న పటాన్‎చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కానీ అప్పటికే గర్భిణి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గర్భిణి మరణంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 8 నెలల గర్భిణి అయినా రాత్రింబవళ్లు చదివి ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమైందని, తీరా పరీక్ష రాయడానికి వస్తే ప్రాణాలే పోయాయంటూ ఆమె భర్త కంటతడి పెట్టుకున్నాడు. ఈ దృశ్యం అందరినీ తీవ్రంగా కలచివేసింది.

You may also like

Leave a Comment