Telugu News » Train Accident: బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..!

Train Accident: బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం..!

ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మంది వరకు గాయపడ్డట్టు సమాచారం.. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు.

by Venu

బంగ్లాదేశ్ (Bangladesh)లో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది.. రాజధాని ఢాకా (Dhaka)కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్‌లో ఈ ఘటన చోటు చేసుకోంది. పూర్తిగా ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా రెండు కోచ్‌లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని ఢాకా రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ (Railway Police Superintendent) అన్వర్ హొస్సేన్ తెలిపారు.

మరోవైపు ఘటనా స్థలిలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మంది వరకు గాయపడ్డట్టు సమాచారం.. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు స్థానిక పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం తెలుపుతున్నారు. రైలు కింద పలువురు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment