Telugu News » World Cup 2023 : భారత్‌ ఫైనల్‌కు వెళ్లడం పై పాకిస్తాన్‌ నటి సంచలన కామెంట్స్‌..!!

World Cup 2023 : భారత్‌ ఫైనల్‌కు వెళ్లడం పై పాకిస్తాన్‌ నటి సంచలన కామెంట్స్‌..!!

భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉందో అసలు అర్థం కావడం లేదని ట్వీట్‌లో అక్కసు వెళ్లగక్కింది.మరో ట్వీట్‌లో సెహర్‌ షిన్వారీ, బీసీసీఐ (BCCI) బీజేపీ (BJP) సర్వనాశనం కావాలని సంచలన కామెంట్స్‌ చేసింది.

by Venu

భారత్-పాకిస్తాన్‌ ఈ రెండు దేశాల మధ్య చీమ చిటుక్కుమన్న సంచలనంగా మారుతుంది. భారత్ పై పాకిస్తాన్‌ కు ఉన్న ద్వేషం ఇప్పటిది కాదు. తాతల ఆస్తులు పంచుకున్నట్టు ద్వేషాన్ని కూడా పాకిస్తాన్‌లో ఉన్న కొందరు పంచుకున్నట్టు ప్రవర్తించడం కనిపిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ నటి (Pakistani actress) సెహర్‌ షిన్వారీ టీమిండియాను ప్రపంచ కప్‌లో ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.

తాజాగా జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన న్యూజిలాండ్‌ (New-Zealand)ను 70 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.. సుమారు 12 ఏళ్ల తర్వాత టీమిండియా వన్డే ప్రపంచకప్‌ వరకు వెళ్లడంతో అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ (Sehar-Shinwari)మాత్రం తన కుళ్ళును ట్విట్టర్ వేదికగా వెళ్లగక్కుతుంది. భారత ఆటగాళ్లు మంచి నటులు. ఈ మ్యాచ్‌ ముందుగానే ఫిక్స్‌ అయ్యిందని వారికి ముందుగానే తెలుసు. కానీ నిజంగానే మ్యాచ్‌ ఆడుతున్నట్లు భలే నటించారని ట్వీట్‌ చేసింది.

భారత జట్టు మరోసారి ప్రపంచ కప్‌ ఫైనల్‌కు వెళ్లడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉందో అసలు అర్థం కావడం లేదని ట్వీట్‌లో అక్కసు వెళ్లగక్కింది.మరో ట్వీట్‌లో సెహర్‌ షిన్వారీ, బీసీసీఐ (BCCI) బీజేపీ (BJP) సర్వనాశనం కావాలని సంచలన కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ నటి కుళ్ళు బుద్ధికి టీమిండియా అభిమానులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

ముఖం అందంగా ఉంటే సరిపోదు.. మనస్సు కూడా అలాగే ఉండాలని, మరోసారి నీ కుళ్లు బుద్ధి చూపించుకున్నావని ఇలా ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు. భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్తాన్ నాటికి ఇదేమీ మొదటి సారి కాదు. ప్రపంచకప్‌ ప్రారంభం నుంచే టీమిండియాపై కుళ్లు బుద్ధి చూపిస్తోంది. భారత్‌పై విజయం సాధిస్తే బంగ్లా ఆటగాళ్లుతో డేటింగ్‌కు వెళతానని బంపరాఫర్‌ ప్రకటించింది. జిమ్మీ నీషమ్‌ తన సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌ను తప్పక గెలిపిస్తాడని ప్రకటనలు చేసింది. ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది.

You may also like

Leave a Comment