Telugu News » Murder: కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో యువకుడి దారుణ హత్య..!

Murder: కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో యువకుడి దారుణ హత్య..!

బిహార్((Bihar)లో అనుమానాస్పద స్థితో యువకుడు మృతిచెందడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య ఎలా జరిగి ఉంటుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.

by Mano
murder in birhar congress

ప్రజల బాగు చూడాల్సిన ప్రజాప్రతినిధి ఇంట్లో ఘోరం వెలుగు చూసింది. ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇంట్లో ఓ యువకుడు దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. అనుమానాస్పద స్థితో యువకుడు మృతిచెందడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య ఎలా జరిగి ఉంటుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.

 

murder in birhar congress

ఈ ఘటన బిహార్((Bihar)లో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్‌(Neethu Singh)కు పీయూష్ సింగ్ దూరపు బంధువు. నీతూ సింగ్ కొన్ని రోజులుగా పట్నాలో ఉంటున్నారు. ఎమ్మెల్యే మేనల్లుడు గోలు సింగ్ సైతం పట్నా(Patna)లోనే నివాసముంటున్నాడు.

శనివారం రాత్రి 7గంటలకు గోలు సింగ్ ఇంటికి వెళ్లిన పియూష్ తిరిగి రాలేదు. ఇవాళ గోలు సింగ్ ఇంట్లో పీయూష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పీయూష్‌ని ఎమ్మెల్యే మేనల్లుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరని వారు వెల్లడించారు.

కేసు దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గోలు సింగ్‌ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామని ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.

 

You may also like

Leave a Comment