Telugu News » KTR : నగరంలో అర్ధరాత్రి కేటీఆర్‌.. ఏం స్కెచ్ వేశావు బాస్..!

KTR : నగరంలో అర్ధరాత్రి కేటీఆర్‌.. ఏం స్కెచ్ వేశావు బాస్..!

ఇటీవల నిలోఫర్ కేఫ్‌లో సందడి చేసిన కేటీఆర్.. శుక్రవారం రాత్రి చార్మినార్‌ సమీపంలోని ఫేమస్‌ షాదాబ్‌ రెస్టారెంట్‌కు (Shadab Restaurant) వెళ్లి అక్కడున్న వారిని సరదాగా పలకరించారు. షాదాబ్‌ రెస్టారెంట్‌ కు కేటీఆర్ వెళ్లడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

by Venu
KTR Strong counter to Pm modi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR).. రోడ్‌ షోలు, బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతూనే.. సిటీలో ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న ఫేమస్ ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

Ktr strong counter to pm modiకాగా ఇటీవల నిలోఫర్ కేఫ్‌లో సందడి చేసిన కేటీఆర్.. శుక్రవారం రాత్రి చార్మినార్‌ సమీపంలోని ఫేమస్‌ షాదాబ్‌ రెస్టారెంట్‌కు (Shadab Restaurant) వెళ్లి అక్కడున్న వారిని సరదాగా పలకరించారు. షాదాబ్‌ రెస్టారెంట్‌ కు కేటీఆర్ వెళ్లడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారందరినీ పలకరిస్తూనే.. రెస్టారెంట్‌ లో ఉన్న ప్రజలతో కలిసి బిర్యానీ తిన్నారు.

అనంతరం మొజంజాహీ మార్కెట్‌ (Mozamjahi Market)లో ఫేమస్‌ ఐస్‌క్రీమ్‌ను రుచి చూశారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్‌ రాకతో రెండు ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. కాగా ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా (X)లో పోస్టు చేశారు కేటీఆర్‌. ప్రస్తుతం నెట్టింట ఈ పిక్ లు వైరల్‌ గా మారాయి.

మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విమర్శలకు ప్రతివిమర్శలతో సమాధానాలు ఇస్తూ.. ఎన్నికల సమరాన్ని రణరంగంగా మారుస్తున్నాయి.. ఈ సమయంలో నగరంలో అర్ధరాత్రి కేటీఆర్‌ ప్రజలతో కలిసిపోవడం వల్ల బీఆర్ఎస్ పై పాజిటివ్ వైబ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు కొందరు భావిస్తున్నారు.

You may also like

Leave a Comment