Telugu News » Prof. Kodandaram: ఉద్యోగం అనే అంశమే ప్రభుత్వంలో లేదు: కోదండరామ్

Prof. Kodandaram: ఉద్యోగం అనే అంశమే ప్రభుత్వంలో లేదు: కోదండరామ్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట(Jammikunta) పట్టణంలోని వినాయక గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

by Mano
Kodandaram Fires On TS Govt Over House Arrests

ఉద్యోగం అనే అంశమే బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో లేదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్(prof. Kodandaram) అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట(Jammikunta) పట్టణంలోని వినాయక గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

kodandaram

 

ఎన్నికలు దగ్గర పడడంతో నిరుద్యోగ సమస్య బలంగా పైకి వచ్చిందన్నారు. దీంతో కేటీఆర్ యువత కాళ్ళ దగ్గర కూర్చొని ఓట్లు అడుగుతున్నాడని కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పదేళ్లలో నిరుద్యోగం మూడింతలు పెరిగిందని కోదండరాం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీ కంపెనీలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడ్డాయని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

నిరుద్యోగ సమస్య తట్టుకోలేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోదండరాం అన్నారు. ఉద్యోగం ఎవరికి వాళ్లు కల్పించుకునేది కాదని, ప్రభుత్వమే ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలిపారు. ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చూడాలన్నారు. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య అభివృద్ధి పెంపొందించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, పేపర్ లీకేజీలు చేసి వ్యాపారం చేసుకుంటున్నారని కోదండరాం మండిపడ్డారు.

స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని చాలా చోట్ల చట్టాలు తెచ్చారని అన్నారు. యువత రాజకీయ ప్రధాన శక్తిగా ఎదిగిందన్నారు. కష్టపడి చదివినా ఏ ఉద్యోగం రావడం లేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు. మళ్ళీ కూలీనాలి చేసుకోవాలని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 200 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. బీఆర్‌ఎస్ మళ్ళీ గెలిస్తే మో చెయ్యి చూపిస్తుందని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతుందని అన్నారు.

You may also like

Leave a Comment