Telugu News » Mynampally Hanumanth Rao : దళిత లంబాడీ భూములు లాక్కున్న చరిత్ర మీది కేటీఆర్..!!

Mynampally Hanumanth Rao : దళిత లంబాడీ భూములు లాక్కున్న చరిత్ర మీది కేటీఆర్..!!

రాజకీయ అనుభవం కూడా సరిగ్గా లేని కేటీఆర్ (KTR) వయస్సుకు మించి మాట్లాడుతున్నాడని మైనం పల్లి మండిపడ్డారు. ఎక్కడ బీఆర్ఎస్ (BRS) ఓడిపోతుందో అనే ప్రెస్టేషన్ కేటీఆర్ కు మొదలైందని అన్నారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోతే కేటీఆర్ సీఎం కల కలగానే మిగులుతుందని.. అందుకే హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు.

by Venu

బీఆర్ఎస్ ను వీడిన తర్వాత మైనంపల్లి హన్మంతరావు దూకుడు పెంచారని అనుకుంటున్నారు.. బీఆర్ఎస్ టార్గెట్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మైనంపల్లి మల్కాజ్ గిరిలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao)..రాష్ట్ర సంపదను మాయం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

malkajgiri-mla-mynampally-hanumantha-rao-strong-warning-to-harish-rao

రాజకీయ అనుభవం కూడా సరిగ్గా లేని కేటీఆర్ (KTR) వయస్సుకు మించి మాట్లాడుతున్నాడని మైనం పల్లి మండిపడ్డారు. ఎక్కడ బీఆర్ఎస్ (BRS) ఓడిపోతుందో అనే ప్రెస్టేషన్ కేటీఆర్ కు మొదలైందని అన్నారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోతే కేటీఆర్ సీఎం కల కలగానే మిగులుతుందని.. అందుకే హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు. ప్రజల ముందు మోడీని గూండా అని తిట్టి.. ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకునే మీరు నీతుల గురించి చెప్పడం హాస్యాస్పదమని మైనం పల్లి అన్నారు.

బ్రోకర్ అవతారం ఎత్తిన మీ నాన్న 20 లక్షల మంది డబుల్ బెడ్ రూంలకు అప్లై చేస్తే లక్ష ఇళ్లు కూడా కట్టించలేదని మైనం పల్లి మండిపడ్డారు.. మాయల ఫకీర్ లా మాటలు చెబుతూ.. పబ్ లకు వెళ్తావ్, కొకైన్ డ్రగ్స్ తీసుకొని సినీ యాక్ట్రర్స్ తో తిరుగుతావు నువ్వా విలువల కోసం మాట్లాడేదని కేటీఆర్ పై విరుచుకు పడ్డారు మైనంపల్లి హన్మంతరావు.. అమరవీరుల త్యాగ ఫలితం వల్ల వచ్చిన తెలంగాణ.. మీరే సాధించినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.. వారి ఉసురు మీకు తగులుతుందని మైనంపల్లి విమర్శించారు..

నన్ను గుండా అని అంటావ్.. నీ చరిత్ర బయటకు తీస్తా అని హెచ్చరించారు. మీ నాన్న ప్రగతి భవన్ నుండి పామ్ హౌస్ వెళ్లడానికి సంవత్సరానికి 80 కోట్లు ఖర్చుపెడుతున్నారని మైనంపల్లి ఆరోపించారు.. ట్రంక్ డబ్బా, రబ్బరు చెప్పులతో తిరిగిన మీ బావ ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడని ఆయన ప్రశ్నించారు. పేపరు లీకులు చేసేది నీవు.. కోట్ల డబ్బులు తీసుకొని మంత్రి పదువులు ఇచ్చే సంస్కృతి నీది అని కేటీఆర్ పై విరుచుకుపడ్డారు మైనంపల్లి .. పోలీస్ అధికారులు చేతిలో ఉన్నారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావంటూ మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. దళిత, లంబాడీ భూముల లాక్కున్న చరిత్ర మీది.. మెదక్ లో పేద ప్రజలకు ఇళ్లు, స్కూల్ కట్టించి సామాజిక సేవ చేస్తున్న చరిత్ర నాది అని మైనంపల్లి అన్నారు.

You may also like

Leave a Comment