Telugu News » Congress : మంత్రులకు శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు.. ఆ వార్తలు అవాస్తవం..??

Congress : మంత్రులకు శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు.. ఆ వార్తలు అవాస్తవం..??

మరో ఆరుగురికి మంత్రి పదవులు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు స్థానం లేకపోవడంతో విస్తరణలో వారికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం

by Venu
telangana congress cm swearing ceremony telangana assembly election results 2023

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య మంత్రిగా రేవంత్‌రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు తొలి కేబినెట్ భేటీలో పాల్గొన్నప్పటికీ.. ఇంకా ఏ శాఖ ఎవరికి కేటాయించారనేది అధికారికంగా ప్రకటించలేదు.

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

అయితే సోషల్ మీడియాలో (Social Media) ఆయా శాఖల మంత్రుల పై వస్తున్న వార్తలను ఖండించారు. మరోవైపు తమకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు (Duddilla Sridharbabu) తెలిపారు. ఫస్ట్ క్యాబినెట్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించడానికి వచ్చినప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా వెల్లడిస్తున్నారా అని పాత్రికేయులు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు.. తన పోర్టుఫోలియోను ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేదని వెల్లడించారు. శాఖలను కేటాయించకపోయినా ఆయా డిపార్టుమెంట్ల అధికారులే పరిపాలనాపరంగా ఉత్తర్వులు ఇస్తారని బదులిచ్చారు. ఇక రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో కలిపి పన్నెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు.

మరో ఆరుగురికి మంత్రి పదవులు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు స్థానం లేకపోవడంతో విస్తరణలో వారికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. అందులో బీసీ నుంచి ఇద్దరు, ఎస్సీ నుంచి ఒకరు, మైనారిటీ నుంచి ఒకరు, రెడ్డి నుంచి ఇద్దరు చొప్పున ఉండొచ్చని కాంగ్రెస్ (Congress) వర్గాల అభిప్రాయం. పలువురు ఆశావహులు మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో తొందరపడి నిర్ణయం తీసుకునేకంటే కులాలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది.

You may also like

Leave a Comment