Telugu News » KCR : ద‌య‌చేసి నా కోసం ఎవ‌రూ ఆ పని చేయవద్దు..కేసీఆర్‌!!

KCR : ద‌య‌చేసి నా కోసం ఎవ‌రూ ఆ పని చేయవద్దు..కేసీఆర్‌!!

తుంటి గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నగులాబీ బాస్ త్వరలోనే ప్రజల ముందుకి వస్తానని.. ప్రజా సమస్యలపై అందరం పోరాడుదామని పిలుపు నిచ్చారు.. నా ఆరోగ్యం మంచిగ అయిన త‌ర్వాత నేను ప్రజ‌ల మ‌ధ్యన ఉండేవాన్నే కాబ‌ట్టి, మ‌నం క‌లుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. ద‌య‌చేసి నా కోరిక‌ను మ‌న్నించి, నా మాట‌ను గౌర‌వించి స‌హ‌క‌రించాల‌ని పేర్కొన్నారు.

by Venu
KCR in a state of disorientation.. If you think my strength and strength, did you leave me alone?

బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు కీలక సందేశం ఇచ్చారు. హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ అనంతరం య‌శోద ఆస్ప‌త్రిలో ఉండి కొలుకొంటున్న కేసీఆర్.. ద‌య‌చేసి నా కోసం ఎవ‌రూ కూడా ఆస్ప‌త్రికి రావొద్ద‌ని, త్వ‌ర‌లోనే మీ మ‌ధ్య‌లోకి వ‌స్తానని విజ్ఞ‌ప్తి చేశారు. హాస్పిట‌ల్‌లో మ‌నం కాకుండా వంద‌లాది మంది ట్రీట్మెంట్ (treatment) తీసుకొనే వారు ఉంటారు..

హాస్పిట‌ల్‌ కి పలు సమస్యలతో వచ్చేవారు ఉంటారు.. కాబట్టి వాళ్ల క్షేమం కూడా మ‌న‌కు ముఖ్యం. అందుకే తప్పుగా భావించ‌కుండా, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మీ ఇళ్ల‌కు చేరండి అని కేసీఆర్ (KCR) వెల్లడించారు. నాకోసం వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి త‌ర‌లివ‌చ్చిన‌టువంటి అభిమానులంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క వంద‌నాలు. అనుకోకుండా జ‌రిగిన యాక్సిడెంట్‌తో య‌శోద హాస్పిట‌ల్‌ (Yashoda Hospital)లో చేరాను. ఈ సంద‌ర్భంలో వైద్య బృందం ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంట‌దని.. అందువల్ల స‌మ‌స్య ఇంకా పెరిగి చాలా అవ‌స్థ‌లు వ‌స్తాయని తెలిపారు..

ఈ విషయాన్ని గ‌మ‌నించి, ద‌య‌చేసి మీరంద‌రూ బాధ‌ప‌డ‌కుండా మీ స్వ‌స్థ‌లాల‌కు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి పోవాలిని కేసీఆర్ ఆసుపత్రి బెడ్‌ నుంచి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా తుంటి గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నగులాబీ బాస్ త్వరలోనే ప్రజల ముందుకి వస్తానని.. ప్రజా సమస్యలపై అందరం పోరాడుదామని పిలుపు నిచ్చారు.. నా ఆరోగ్యం మంచిగ అయిన త‌ర్వాత నేను ప్రజ‌ల మ‌ధ్యన ఉండేవాన్నే కాబ‌ట్టి, మ‌నం క‌లుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. ద‌య‌చేసి నా కోరిక‌ను మ‌న్నించి, నా మాట‌ను గౌర‌వించి స‌హ‌క‌రించాల‌ని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment