Telugu News » Nampally : ఫైళ్ల మాయం కేసులో మలుపు.. పోలీస్ స్టేషన్ లో తలసాని మాజీ ఓఎస్డీ..!!

Nampally : ఫైళ్ల మాయం కేసులో మలుపు.. పోలీస్ స్టేషన్ లో తలసాని మాజీ ఓఎస్డీ..!!

పశుసంవర్ధక శాఖలో పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయని, వాటిని కళ్యాణ్ తీసుకెళ్లాడంటూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కళ్యాణ్ అరెస్టును తప్పించుకునే ప్లాన్ లో భాగంగా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు పిలవడంతో సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టు తెలుస్తోంది.

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం.. డిసెంబరు 8న మాసబ్ ట్యాంక్‌ (Massab tank)లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన ఫైళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) ఓఎస్డీ (OSD) కళ్యాణ్ (Kalyan) సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు.

ఈ క్రమంలో రాత్రి వరకి పోలీసులు ఆయనను విచారించినట్టు సమాచారం… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత కళ్యాణ్ తన పాత ఆఫీసుకు వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆఫీసులో పలు ఫైళ్లను చింపి.. చిత్తు కాగితాలుగా మార్చి బయటకి తీసుకెళ్లినట్టు ప్రచారం జరిగింది. కాగా ఆఫీస్ వాచ్ మెన్ ఫిర్యాదుతో ఈ నెల 9న కళ్యాణ్ పై నాంపల్లి (Nampally) పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పశుసంవర్ధక శాఖలో పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయని, వాటిని కళ్యాణ్ తీసుకెళ్లాడంటూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కళ్యాణ్ అరెస్టును తప్పించుకునే ప్లాన్ లో భాగంగా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు పిలవడంతో సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలసాని వద్ద కళ్యాణ్ ఓఎస్ డీ గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం మారిన తర్వాత విధుల నుంచి తప్పుకొన్నారు

 

You may also like

Leave a Comment