Telugu News » TS Covid Cases : తెలంగాణలో మెల్లగా వ్యాపిస్తోన్న కరోనా.. నేటి యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

TS Covid Cases : తెలంగాణలో మెల్లగా వ్యాపిస్తోన్న కరోనా.. నేటి యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనా బాధితులకి చికిత్స కోసం.. ఆయా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. కాగా కరోనా కొత్త వేరియంట్.. జెన్-1 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచి స్తోంది.

by Venu
Covid Outbreak: Active cases close to 3 thousand mark.. Center's key instructions..!

తెలంగాణ (Telangana)లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ (Health Department) కరోనా బులిటెన్ విడుదల చేసింది. వారి వివరాల ప్రకారం.. రాష్ట్రంలో శుక్రవారం 1,245 మందికి పరీక్షలు నిర్వహించగా…తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 27కు చేరినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20 ఉండగా.. ఈరోజు కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే.. హైదరాబాద్‌లో (Hyderabad) ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. రంగారెడ్డిలో ఒకరికి కొవిడ్ (Covid) సోకింది. నిలోఫర్ ఆస్ప త్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనా బాధితులకి చికిత్స కోసం.. ఆయా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. కాగా కరోనా కొత్త వేరియంట్.. జేఎన్-1 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉంటే.. కరోనాను సులభంగా ఎదుర్కోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ (Andrapradesh)లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరులో ఒక కరోనా పాజిటివ్ నమోదయ్యింది. కొత్త వేరియంట్ అలర్ట్‌‌తో ఆరుగురికి ర్యాండమ్‌గా టెస్ట్‌లు నిర్వహించారు. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ గా పాజిటివ్‌గా తేలింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించినట్టు వైద్యాధికారులు తెలిపారు..

You may also like

Leave a Comment