Telugu News » రాముడి మీద అక్కసు…!

రాముడి మీద అక్కసు…!

రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఫైర్ అయ్యారు.

by Ramu
Loan waiver is just an election stunt.. Rajya Sabha MP Laxman's key comments

-హిందువులను విమర్శిస్తోంది
-కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు
-హస్తం పార్టీపై లక్ష్మణ్ ఫైర్

కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. హిందువుల మనోభావాలను ఆ పార్టీ దెబ్బ తీస్తోందని అన్నారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఫైర్ అయ్యారు.

humiliating bcs has become a habit of congress

రాముడి మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదని ఫైర్ అయ్యారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేక పోతోందన్నారు. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందన్నారు.

మోడీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తోందని… ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామన్నారు.

You may also like

Leave a Comment