Telugu News » Revanth Reddy : తొలగిన అడ్డంకులు.. సీఎం చేతుల మీదుగా కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఎంపిక పత్రాలు..!

Revanth Reddy : తొలగిన అడ్డంకులు.. సీఎం చేతుల మీదుగా కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఎంపిక పత్రాలు..!

ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖలో తొమ్మిది విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌నర్సులకు నియామక పత్రాలను అందించారు. మరోవైపు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక పత్రాలను అభ్యర్థులకు అందజేయనున్నారు.

by Venu
CM Revanth Reddy in Delhi. Candidates hoping for MP ticket in tension!

తెలంగాణ (Telangana)లో ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడిందని అంటున్నారు.. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయాలు తీసుకొంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల హామీలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో కీలక హామీ ఇచ్చిన సీఎం.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖలో తొమ్మిది విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌నర్సులకు నియామక పత్రాలను అందించారు. మరోవైపు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక పత్రాలను అభ్యర్థులకు అందజేయనున్నారు.

ఈ మేరకు హోంశాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి.. 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది అక్టోబరులో తుది జాబితా ప్రకటించింది. కాగా ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందచేస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైళ్ల, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలకు సంబంధించి 16 వేల 604 పోస్టులకుగాను 12 వేల 866 మంది పురుషులు, 2,884 మంది మహిళ అభ్యర్ధులను ఎంపిక చేసింది. మరోవైపు అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించారు.

ఇక పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న వ్యాజ్యాల కారణంగా తుది ఎంపిక ఫలితాలను వెల్లడించలేదు. అయితే ఇంతకాలం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా ఆలస్యం నెలకొన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అడ్డంకులు తొలిగిపోవడంతో ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది.

You may also like

Leave a Comment