Telugu News » Delhi : మరో కీలక డిమాండ్ తెరపైకి తెచ్చిన హిందూ సంఘాలు.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన..!

Delhi : మరో కీలక డిమాండ్ తెరపైకి తెచ్చిన హిందూ సంఘాలు.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన..!

గతంలో అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి ఒక చట్టాన్ని రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిన విషయాన్ని హిందూ సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేస్తున్న విపరీత వ్యాఖ్యలకు ముగింపు పలకాలని వారు కోరుతున్నారు.

by Venu

హిందూ సంఘాలు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కి కీలకమైన లేఖ రాశాయి. హిందువులంతా భగవంతుని స్వరూపంగా కొలిచే శ్రీ రాముడు, శ్రీ కృష్ణులపై ఎవరైనా అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష విధించేలా న్యాయపరమైన విధివిధానాలను రూపొందించాలని లేఖలో కోరాయి. ఇప్పటికే పలువురు హిందూ దేవతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఒకవైపు దేశవ్యాప్తంగా శతాబ్దాల హిందువుల కల నెరవేర్చిన బీజేపీ (BJP).. అయోధ్య (Ayodhya)లో రామమందిరం నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసింది. అయితే శ్రీరామ మందిర నిర్మాణం తర్వాత ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉండగా మరోవైపు మధుర లోని శ్రీ కృష్ణ దేవాలయాన్ని సైతం ఇలాగే పునర్నిర్మాణం చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

మరోవైపు హిందూ ఆలయ నిర్మాణాలను జీర్ణించుకోలేని కొందరు శ్రీరాముడు, శ్రీకృష్ణు (Rama and Krishna)లపై తరచూ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాలకు పరిష్కారంగా శ్రీరామ శ్రీకృష్ణులకు గౌరవ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంఘాలు ఢిల్లీ (Delhi) జంతర్ మంతర్ (Janthar Manthar) వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ఇదిలా ఉండగా గతంలో అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి ఒక చట్టాన్ని రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిన విషయాన్ని హిందూ సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేస్తున్న విపరీత వ్యాఖ్యలకు ముగింపు పలకాలని వారు కోరుతున్నారు. అయితే ఢిల్లీ అంతటా రైతు సంఘాల ధర్నా కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉండడంతో తాము చేపట్టాల్సిన దీక్ష వాయిదా పడిందని, వచ్చేనెల తప్పకుండా దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని హిందూ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment