Telugu News » Hyderabad : లాస్య మృతిపై కేటీఆర్‌ ఎమోషనల్.. అందుకే రాలేకపోయా.. !

Hyderabad : లాస్య మృతిపై కేటీఆర్‌ ఎమోషనల్.. అందుకే రాలేకపోయా.. !

ఆమె తండ్రి సాయన్న ఏడాది క్రితమే మరణించారని గుర్తు చేసిన కేటీఆర్‌.. అంతలోనే నందిత మరణించడం తీవ్ర విషాదామని అన్నారు..

by Venu
KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) దివంగత ఎమ్మెల్యే (MLA) లాస్య నందిత (Lasya Nandita) కుటుంబాన్ని పరామర్శించారు. నేటి ఉదయం మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి (MallaReddy)తో కలిసి కార్ఖానాలో ఉన్న ఆమె నివాసానికి వెళ్లారు. నందిత తల్లి, సోదరిని ఓదార్చారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్‌ నందిత మరణం తీరనిలోటని పేర్కొన్నారు.

Breaking: BRS MLA Lasya Nandita dies in a car accident..!

మరోవైపు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని తెలిపారు. అయితే తాను విదేశాల్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు రాలేకపోయానని వెల్లడించారు. ఆమె తండ్రి సాయన్న ఏడాది క్రితమే మరణించారని గుర్తు చేసిన కేటీఆర్‌.. అంతలోనే నందిత మరణించడం తీవ్ర విషాదామని అన్నారు.. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుతున్నట్లు చెప్పారు.

ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన యువ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత అకాల మరణం మా అందరికీ ఎంతో బాధ కలగించింది. చిన్న వయసులోనే లాస్య చనిపోవడం మా పార్టీతోపాటు కంటోన్మెంట్ ప్రజలను తీవ్రంగా బాధపెట్టిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా లాస్య నందితను అనేక ప్రమాదాలు వెంటాడాయని అన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

కంటోన్మెంట్‌ (Cantonment) బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, పటాన్‌చెరు, ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

You may also like

Leave a Comment