Telugu News » Purandeswari: పురంధేశ్వరి ఢిల్లీ బాట.. నంద్యాల పర్యటన రద్దు..!

Purandeswari: పురంధేశ్వరి ఢిల్లీ బాట.. నంద్యాల పర్యటన రద్దు..!

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari) ఢిల్లీబాట పట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ నంద్యాల(Nandyala)లో పర్యటించాల్సిన ఆమె చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.

by Mano
Purandeswari: Purandeswari's trip to Delhi.. Nandyal's tour is cancelled..!

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari) ఢిల్లీబాట పట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ నంద్యాల(Nandyala)లో పర్యటించాల్సిన ఆమె చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. బీజేపీ(BJP) అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇన్‌చార్జిగా ఉన్న భూమా కిషోర్‌రెడ్డిలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Purandeswari: Purandeswari's trip to Delhi.. Nandyal's tour is cancelled..!

ఈ నేపథ్యంలో పురంధేశ్వరి నంద్యాలకు వెళ్లాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినకు వెళ్లినట్లు బీజేపీ ఏపీ వర్గాలు తెలిపాయి.

ఇటీవలే జిల్లాల్లోని ముఖ్య నేతల అభిప్రాయ సేకరణ, పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు పురంధేశ్వరి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ ఏపీలో పార్టీ పరిస్థితి, ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు.

బీజేపీ విడుదల చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఏపీలోని లోక్ సభ స్థానాలూ ఉంటాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. వీటి కోసం పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు వ్యవహారాన్ని తేల్చేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

You may also like

Leave a Comment