Telugu News » Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..!

Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..!

సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ఉన్న జంబార్​ టోల్​బూత్​ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్ళిన యాత్రికులు అంతా నాసిక్ జిల్లాలో ఇందిరానగర్​కు చెందిన వారుగా సమాచారం.

by Venu

మహారాష్ట్ర (Maharashtra)లో ఛత్రపతి (Chatrapati) శంబాజీనగర్ (Shambajinagar) సమృద్ధి ఎక్స్​ప్రెస్​వే (Samruddhi Expressway) పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెలర్​ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారితో సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. సైలాని బాబా దర్శనం చేసుకుని వీరంతా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 20 మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది.

సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ఉన్న జంబార్​ టోల్​బూత్​ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్ళిన యాత్రికులు అంతా నాసిక్ జిల్లాలో ఇందిరానగర్​కు చెందిన వారుగా సమాచారం. మరోవైపు శనివారం అర్ధరాత్రి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ఉన్న జంబూర్ టోల్​బూత్​ సమీపంలో ఆర్​టీఓ పలు వాహానాలను నిలిపివేశారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న ట్రావెలర్​ బస్​.. ట్రక్కును ఢీకొట్టింది.

ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు, సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఘాటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ ఎక్స్​ప్రెస్​ వే పై 729 ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఈ ప్రమాదాలపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయని.. అందుకే డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటారని అందువల్ల జరుగుతున్నాయని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment