Telugu News » Accident In London: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థిని మృతి..!

Accident In London: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థిని మృతి..!

లండన్‌(London)లో జరిగిన ఓ ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతిచెందింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

by Mano
Accident In London: Road accident in London.. Indian student died..!

లండన్‌(London)లో జరిగిన ఓ ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతిచెందింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌కు చెందిన చేష్టా కొచ్చర్(33) ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ (LSE)లో పీహెచ్‌డీ చేస్తోంది.

Accident In London: Road accident in London.. Indian student died..!

మార్చి 19న భర్తతో కలిసి సైక్లింగ్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఆ సమయంలో భర్త ఆమె ముందు సైకిల్ నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో చేష్టా కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆమె తండ్రి లెఫ్టెనెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చేష్టా కొచ్చర్ గతంలో ఆమె గతంలో నీతి ఆయోగ్‌లో పనిచేసింది. గతంలో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో చదివారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్‌లోని నేషనల్ బహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్‌లో సీనియర్ సలహాదారుగా పని చేశారు.

బిహేవియరల్ సైన్స్‌లో పీహెచీడీ చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు వెళ్లింది. ఆమె మృతిపట్ల నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఎంతో ధైర్యవంతురాలని, తెలివైన వ్యక్తి అని కితాబిచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని అమితాబ్ కాంత్ ఎక్స్‌‌లో రాసుకొచ్చారు.

You may also like

Leave a Comment