Telugu News » Allu Arjun : ఆరు నిమిషాల ఆ సీన్‌కు రూ. 60 కోట్లు.. మీరు మాములోళ్ళు కాదు సామి..!

Allu Arjun : ఆరు నిమిషాల ఆ సీన్‌కు రూ. 60 కోట్లు.. మీరు మాములోళ్ళు కాదు సామి..!

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు.. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తున్నారు.

by Venu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) హీరో, హీరోయిన్ గా డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘పుష్ప2’ (Pushpa-2).. కాగా ఈ చిత్రం మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వస్తున్న పార్ట్ 2 పై సైతం మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి..

అలా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ అల్లు ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు.. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్.. బాడీ పెయింట్‌తో నీలం పట్టు చీర ధరించి కనిపించారు..

ఇలా డిఫరెంట్ లుక్ లో ఐకాన్ స్టార్ కనిపించడంతో తిరుపతిలో గంగమ్మ తల్లి జాతరకు మాతంగి వేషం వేసిన పుష్ప రాజ్‌ లుక్‌ అదిరింది అంటూ.. అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే.. ఈ ఒక్క నిమిషం టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. ట్రెండింగ్‌లో నిలిచింది.. అయితే.. ఈ ఆరు నిమిషాల జాతర సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ సుమారుగా రూ. 60 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తుంది..

అలాగే ఈ సీన్‌ని పూర్తి చేయడానికి మేకర్స్ దాదాపు 30 రోజులు పట్టిందని అనుకొంటున్నారు.. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంటే.. మ్యాటర్ తెలిసిన జనం.. షాక్ అవుతున్నారు..

You may also like

Leave a Comment