Telugu News » TDP : ఆసక్తికరంగా మారిన ఆంధ్ర పాలిటిక్స్.. టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎంపీ..!

TDP : ఆసక్తికరంగా మారిన ఆంధ్ర పాలిటిక్స్.. టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎంపీ..!

ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కృష్ణంరాజు టీడీపీలో చేరటంతో చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకి శుభం కార్డ్ పడింది.

by Venu
TDP: Final list of TDP candidates released..!

ఏపీ (AP) పాలిటిక్స్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.. నేతలు పార్టీ మారుతున్న దృశ్యాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో పలు రాజకీయ వివాదాలకు కేరాఫ్ గా మారిన వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghurama Krishnam Raju) టీడీపీ (TDP)లో చేరారు. చంద్రబాబు సమక్షంలో పాలకొల్లు సభలో కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Politics: YCP MP Raghurama Krishnaraju resigns..!తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కృష్ణంరాజు టీడీపీలో చేరటంతో చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకి శుభం కార్డ్ పడింది. మరోవైపు కూటమి తరఫున ఎంపీగా పోటీ చేస్తానని చాలా రోజుల నుంచి వెల్లడిస్తున్న ఆయనకి టికెట్ దక్కలేదు. కనీసం నరసాపురం ఎంపీగా అయినా పోటీ చేయాలని భావించారు.

ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే, చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సభలో చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని మండిపడ్డారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని విమర్శలు గుప్పించారు..

You may also like

Leave a Comment