Telugu News » tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత!

tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత!

ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జాము సమయంలో తిరుపతి కాలినడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది

by Sai
another leopard trapped in tirumala step way

తిరుమల (tirumala)నడకదారిలో టీటీడీ(ttd) , అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ (operation chirutha) ముగిసింది. ఎట్టకేలకు బోనులో నాలుగో చిరుత చిక్కింది. తిరుమల కాలినడక మార్గంలో వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాలినడక మార్గంలో పలు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. అయితే, కొద్దిరోజులుగా చిరుత పులి బోను వద్దకు వచ్చినట్లేవచ్చి వెనుదిరిగిపోతుంది.

another leopard trapped in tirumala step way

దీంతో చిరుతను పట్టుకొనేందుకు అటవీశాఖ అధికారులు పలు విధాల ప్రయత్నాలు చేశారు. చివరికి అటవీశాఖ అధికారుల ప్రయత్నం సఫలమైంది. ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జాము సమయంలో తిరుపతి కాలినడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు చిరుతలను అధికారులు బంధించారు.

తిరుమల నడక మార్గంలో చిరుత పులి చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్ అయింది. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు టీటీడీ భద్రతను కట్టుదిట్టం చేసింది. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా ప్రకటించింది.

ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. ఈనెల 11న లక్షితపై చిరుతదాడి చేసి హతమార్చగా.. అలర్ట్ అయిన టీటీడీ, అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈనెల 14న, 17వ తేదీన రెండు చిరుతలు బోనులో చిక్కాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది.

లక్షిత ఘటన తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేసి రెండు చిరుతలను బంధించారు. అయితే, వన్య ప్రాణుల సంచారంకోసం శేషాచలం అటవీ ప్రాంతంలో 300 ట్రాప్ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 7వ మైలు మార్గంలో చిరుతను గుర్తించారు. చిరుతను బంధించేందుకు తొమ్మిది బోనులను ఏర్పాటు చేశారు. చిరుత బోనుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోతుండటాన్ని ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు.

పలు వ్యూహాలను అమలుపర్చి చిరుత పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జామున చిరుత పులి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. ఇప్పటికే గతనెల జూన్ 24న ఓ చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. లక్షిత ఘటన తరువాత 14, 17వ తేదీల్లో రెండు చిరుతలను బంధించారు. తాజాగా సోమవారం మరో చిరుత బోనులో చిక్కడంతో రెండు నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు.

You may also like

Leave a Comment