Telugu News » Uttam Kumar : అలా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..!!

Uttam Kumar : అలా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎంపీ షాకింగ్ కామెంట్స్..!!

హుజూర్ నగర్ లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ పై కేటీఆర్, కవిత చేసిన వ్యాఖ్యలు సరికాదని ఉత్తమ్ మండిపడ్డారు.

by Venu
Uttam Kumar Reddy: 'Police in favor of the ruling party'.. Uttam's impatience..!

అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట (Suryapet) జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం వెళ్లిన ఉత్తమ్ కుమార్ కి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉత్తమ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ పై కేటీఆర్, కవిత చేసిన వ్యాఖ్యలు సరికాదని ఉత్తమ్ మండిపడ్డారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని, రాజకీయంగా పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా సోనియమ్మ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చారని ఉత్తమ్ తెలిపారు. మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

You may also like

Leave a Comment