Telugu News » Phirjadiguda : పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం.. ఆత్మహత్య చేసుకొన్న ఇంటర్ విద్యార్థిని..!!

Phirjadiguda : పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం.. ఆత్మహత్య చేసుకొన్న ఇంటర్ విద్యార్థిని..!!

మరోవైపు వర్ష ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఇంకేదైనా కారణం ఉందా?.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే కాలేజీలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రమాదేవి అనే ఫస్టియర్ విద్యార్థిని.. లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకొంది.. వర్ష ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సింది..

by Venu

రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు (Suicides) ఆగడం లేదు.. కారణం ఏదైనా కాలేజీలో చదువుకొంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఫీర్జాదిగూడ (Phirjadiguda).. శ్రీ చైతన్య కాలేజీ (Sri Chaitanya College)లో దారుణం చోటు చేసుకోంది. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కళాశాల గర్ల్స్ క్యాంపస్ లో, తన రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అయితే విషయం గమనించిన కళాశాల సిబ్బంది వర్షని స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకి సమాచారం ఇచ్చారు.. కాగా అప్పటికే విద్యార్థిని మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల, వర్ష స్వస్థలం అని తెలుస్తోంది.

మరోవైపు వర్ష ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఇంకేదైనా కారణం ఉందా?.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే కాలేజీలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రమాదేవి అనే ఫస్టియర్ విద్యార్థిని.. లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకొంది.. వర్ష ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సింది..

You may also like

Leave a Comment