Telugu News » Attapur: పతంగి ఎగురవేస్తూ.. విద్యుత్‌ తీగలు తగిలి బాలుడు మృతి..!

Attapur: పతంగి ఎగురవేస్తూ.. విద్యుత్‌ తీగలు తగిలి బాలుడు మృతి..!

అత్తాపూర్‌ లక్ష్మీవాణి టవర్స్‌పై పిల్లలు పతంగులు ఎగురవేస్తున్నారు. వారితోపాటు మహారాష్ట్రకు చెందిన తనిష్క్‌(11) గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యాడు.

by Mano
Attapur: Boy dies after being hit by electric wires while flying a kite..!

సంక్రాంతి పండుగ వేళ రాజేంద్రనగర్‌లో (Rajendrnagar) విషాదం చోటుచేసుకున్నది. రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో (Attapur) ఓ ఇంటిపై పతంగి ఎగురవేస్తున్న బాలుడు విద్యుధాఘాతంతో మృతిచెందాడు.

Attapur: Boy dies after being hit by electric wires while flying a kite..!

అత్తాపూర్‌ లక్ష్మీవాణి టవర్స్‌పై పిల్లలు పతంగులు ఎగురవేస్తున్నారు. వారితోపాటు మహారాష్ట్రకు చెందిన తనిష్క్‌(11) గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన తనిష్క్ అన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.

వారు బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే తనిష్క్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పండుగ పూట ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందు ఇక లేడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment