Telugu News » Ayodhya Ram mandir: క్రీడా ప్రముఖులకు అందిన అయోధ్య ఆహ్వానం..!

Ayodhya Ram mandir: క్రీడా ప్రముఖులకు అందిన అయోధ్య ఆహ్వానం..!

అయోధ్య(Ayodhya)లో రామమందిర(Ram Mandir) ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దాదాపు 8వేల మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు.

by Mano
Ayodhya Ram mandir: Ayodhya invitation to sports celebrities..!

అయోధ్య(Ayodhya)లో రామమందిర(Ram Mandir) ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8వేల మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు.

Ayodhya Ram mandir: Ayodhya invitation to sports celebrities..!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, హర్మన్త్ కౌర్లకు అయోధ్య ఆహ్వానం అందుకున్నారు.

అయితే బీసీసీఐ అవార్డ్స్, జనవరి 25 నుంచి ఇంగ్లండ్ మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరు వెళ్తారనేది చూడాల్సివుంది. అదేవిధంగా చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, స్ప్రింట్ క్వీన్ పీటీ ఉష, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు అయోధ్య ఆహ్వానం అందింది.

వీరితో పాటు స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారిణి భైచుంగ్ భూటియా, మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, స్ప్రింటర్ కవితా రౌత్, పారాలింపిక్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా ఆహ్వానం అందుకున్నారు.

You may also like

Leave a Comment