Telugu News » Bandla Ganesh: కేటీఆర్, హరీశ్‌రావులకు ఎందుకంత అసూయ: బండ్ల గణేశ్

Bandla Ganesh: కేటీఆర్, హరీశ్‌రావులకు ఎందుకంత అసూయ: బండ్ల గణేశ్

గాంధీభవన్‌లో బండ్ల గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే.. హరీశ్‌రావు ఎందుకంత అసూయ అని ప్రశ్నించారు.

by Mano
Bandla Ganesh: Why are KTR and Harish Rao jealous: Bandla Ganesh

మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్(KTR), హరీశ్‌రావు (Harishrao)లపై సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్‌(Bandla Ganesh) కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో బండ్ల గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే.. హరీశ్‌రావు ఎందుకంత అసూయ అని ప్రశ్నించారు.

Bandla Ganesh: Why are KTR and Harish Rao jealous: Bandla Ganesh

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి పాటుపడుతున్నారని బండ్ల గణేష్ చెప్పారు. ఇంత చేస్తుంటే కేటీఆర్, హరీశ్‌రావులు ఈర్శ్య, ద్వేషంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక రోజు హరీశ్‌రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత మాట్లాడతారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ఎవరూ ఏం చేయలేరని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో లక్షల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఆరోగ్య బీమా రూ.10లక్షలు చేశామని తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులే అయిందని అర్థం చేసుకోకుండా హరీశ్‌రావు, కేటీఆర్ ప్రతీ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment