Telugu News » కేసీఆర్ మజ్లిస్ కోసమే జాతీయ సమైక్యత దినోత్సవం!

కేసీఆర్ మజ్లిస్ కోసమే జాతీయ సమైక్యత దినోత్సవం!

నయా రాజాకార్ల పార్టీని.. కేసీఆర్ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం.

by Sai
bjp mp bandi sanjay critisized telangana chief minister kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.”మజ్లిస్ కోసమే సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుతున్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం పబ్లిక్ గార్డెన్ లో కాదు దారుసలాంలో జరుపుకోవాలి. కేసీఆర్ జమిలి ఎన్నికలంటే గజగజ వణికిపోతున్నారు.

bjp mp bandi sanjay critisized telangana chief minister kcr

కేంద్రం జమిలి ఎన్నికలు జరుపుతామని ఇంకా స్పష్టం చేయలేదు. కేంద్రం చెప్పేవరకు ఓపిక లేకుండా కేసీఆర్ కుటుంబం వణికిపోతుంది. మంత్రివర్గంలో అందరూ డమ్మిలే.. ఒక్కరికీ పవర్ లేదు. మంత్రివర్గం కంటే కేసీఆర్ కు సలహాదారులే ఎక్కువ. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు రావు, జీతాలు రావు.

బీజేపీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు, జీతాలు వస్తాయి. పేద వాళ్లు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. జమిలి ఎన్నికలు వచ్చిన, సింగల్ గా జరిగిన తెలంగాణలో కమలం వికసిస్తుంది. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ సర్వ నాశనం అయ్యింది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు గెలిస్తే బీఆర్ఎస్ లోకే పోతారు.

నయా రాజాకార్ల పార్టీని.. కేసీఆర్ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం తెస్తాం.” అని బండి సంజయ్ అన్నారు.

You may also like

Leave a Comment