Telugu News » BRS: రెండు ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటన..!

BRS: రెండు ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటన..!

తెలంగాణ(Telangana)లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

by Mano
BRS: Announcement of names of BRS candidates for two MP posts..!

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలు తమ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు గానూ పార్టీలు ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించాయి.  తాజాగా తెలంగాణ(Telangana)లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

BRS: Announcement of names of BRS candidates for two MP posts..!

ఇందులో భాగంగా రెండు పార్ల‌మెంట్ స్థానాల‌కు బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar), మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంక‌ట్రామిరెడ్డి(Venkatramireddy)ని బ‌రిలో దించుతున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.

భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, సికింద్రాబాద్, హైద‌రాబాద్, చేవెళ్ల‌ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ నాలుగు స్థానాల‌కు కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి పోటీ చేయనున్నారు.

ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య‌ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వ‌ర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వ‌ర్ రావు, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌ పోటీ చేయ‌నున్నారు.

You may also like

Leave a Comment