Telugu News » Hyderabad : రాయదుర్గంలో కారు ప్రమాదం.. ఒకరు మృతి..!!

Hyderabad : రాయదుర్గంలో కారు ప్రమాదం.. ఒకరు మృతి..!!

అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందారు. వీరంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా తేల్చారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

by Venu

హైదరాబాద్ (Hyderabad).. రాయదుర్గం (Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం (Road accident) చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి (Died) చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

Road Accident: A van collided with a stationary lorry.. Three died..!

పోలీసులు గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా శివరామకృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు వెల్లడించారు.. ఈమేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన పోలీసులు.. ఈ ప్రమాదానికి కారణం అతి వేగమని వెల్లడించారు..

ఇదిలా ఉండగా.. అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందారు. వీరంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా తేల్చారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గండేపల్లి మండలం రాగంపేట వద్ద గౌహతికి చేపల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడి డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు.

You may also like

Leave a Comment