Telugu News » Chandrababu: ’హైదరాబాద్‌ వెలిగిపోతుంటే… జగన్ పాలనలో అమరావతి వెలవెలబోతోంది‘…!

Chandrababu: ’హైదరాబాద్‌ వెలిగిపోతుంటే… జగన్ పాలనలో అమరావతి వెలవెలబోతోంది‘…!

ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. జగన్మోహన్ రెడ్డి రివర్స్‌ పాలనలో అమరావతి వెలవెలబోతోందని విమర్శించారు.

by Mano
Chandrababu: 'If Hyderabad is shining... Amaravati is going to shine under Jagan's rule'...!

ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. జగన్మోహన్ రెడ్డి రివర్స్‌ పాలనలో అమరావతి వెలవెలబోతోందని విమర్శించారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.

Chandrababu: 'If Hyderabad is shining... Amaravati is going to shine under Jagan's rule'...!

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు తెలిపారు. 25 సంవత్సరాల క్రితం తాను పిల్లలకు ఇచ్చిన ఆయుధం ’ఐటి‘ అని చెప్పారు. తనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందన్నారు. ఒకపక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే… సీఎం జగన్ చర్యల వల్ల అమరావతి వెలవెలబోతోందని అన్నారు.

కాగా, ఆదివారం తిరువూరులో జరుగుతోన్న ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కృష్ణా జిల్లా వాసులు ఉంటారని అన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వాళ్ళు ముందుంటారని తెలిపారు. కృష్ణాజిల్లా వాసులు ప్రపంచమంతా విస్తరించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ‘రా కదలిరా’ అంటూ నారా చంద్రబాబు తిరువూరు సభ వేదికగా తెలుగువారికి పిలుపునిచ్చారు.

అంతకుముందు తిరువూరు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ-జనసేన నేతలు స్వాగతం పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు.. ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీగా వాహనాల్లో నేతలు తరలి వచ్చారు.

You may also like

Leave a Comment