Telugu News » BRS : సీఎం రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్.. మాజీ ఎమ్మెల్యే గాదరికిషోర్ సంచలన వ్యాఖ్యలు

BRS : సీఎం రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్.. మాజీ ఎమ్మెల్యే గాదరికిషోర్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ (Ex Mla Gadari kishore Kumar) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై(Cm Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఓ జిత్తులమారి నక్క.. బ్లాక్ మెయిలర్ అని ఆయనపై విరుచుకపడ్డారు.

by Sai
CM Revanth is a blackmailer. Ex-MLA Gadarikishore's sensational comments

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ (Ex Mla Gadari kishore Kumar) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై(Cm Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఓ జిత్తులమారి నక్క.. బ్లాక్ మెయిలర్ అని ఆయనపై విరుచుకపడ్డారు.

CM Revanth is a blackmailer. Ex-MLA Gadarikishore's sensational comments

రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సొసైటీలో బ్లాక్ మెయిల్ చేసి అక్రమంగా సంపాదించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పాలమూరును వాడుకోవడం తప్ప అక్కడి ప్రజలకు ఏమైనా చేద్దామనే ఆలోచన ఆయనకు లేదన్నారు.

ఓటుకు నోటు కేసులో ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రేవంత్ రెడ్డి వద్దకు రాకుండా ప్రధాని మోడీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని పేర్కొన్నారు.

కేసీఆర్,బీఆర్ఎస్ పేరు వాడుకోకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజకీయం చేయలేడన్నారు. భారతదేశంలో ప్రధాని మోడీతో కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతల హస్తముందని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.ఇటీవల బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లో గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీవితాంతం ఫిరాయింపు రాజకీయాలే చేస్తూ బతుకుతాడని ఫైర్ అయ్యారు.

You may also like

Leave a Comment