Telugu News » CM Revanth Reddy: చచ్చిన పామును ఎవరన్నా మళ్లీ చంపుతారా?: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: చచ్చిన పామును ఎవరన్నా మళ్లీ చంపుతారా?: సీఎం రేవంత్ రెడ్డి

చచ్చిన పామును ఎవరన్నా మళ్లీ చంపుతారా? అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌(Ex CM KCR) ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

by Mano
CM Revanth Reddy: Can anyone kill a dead snake again?: CM Revanth Reddy

చచ్చిన పామును ఎవరన్నా మళ్లీ చంపుతారా? అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌(Ex CM KCR) ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకుండా పారిపోయి తప్పించుకు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy: Can anyone kill a dead snake again?: CM Revanth Reddy

మూడు రోజులుగా సభలో అన్ని విషయాలను చర్చించాలని అనుకున్నట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని చూసి అందరం చర్చిద్దామని పిలిస్తే ఎవరూ రాలేదని రేవంత్‌ అన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళదే తప్పు అన్నట్లు మట్లాడుతున్నారని మండిపడ్డారు.

నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.  మేడిగడ్డ మీద చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ‘కావాలంటే హరీశ్‌రావుకు పెత్తనమిస్తాం.. మేడిగడ్డ ఎలా నింపుతారో నింపండి’ అంటూ సవాల్ విసిరారు.

నీళ్లు నిలిచే పరిస్థితి లేకుండా ఉంటే ఇక్కడకు వచ్చి మళ్ళీ మాట్లాడతారా? అని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చిద్దామన్నారు. కాళేశ్వరం మీద అయినా.. మేడిగడ్డ మీద చర్చ చేయడానికైనా సిద్ధం మేము అని రేవంత్ అన్నారు. నిజానిజాలు తెలిశాక కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు.

You may also like

Leave a Comment