Telugu News » Dhanush: ధనుష్ తన కొడుకని న్యాయపోరాటం చేసిన వ్యక్తి మృతి..!

Dhanush: ధనుష్ తన కొడుకని న్యాయపోరాటం చేసిన వ్యక్తి మృతి..!

ధనుష్(Dhanush) తమ కుమారుడు అంటూ మధురై జిల్లా(Madhuri District) మేలూరుకు చెందిన కతిరేశన్(Kathireshan), ఆయన భార్య మీనాక్షి(Meenakshi) న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే.

by Mano
Dhanush: Dhanush's son's legal battle has died..!

కోలీవుడ్ యంగ్‌ హీరో(Kollywood Young Hero) ధనుష్(Dhanush) తమ కుమారుడు అంటూ మధురై జిల్లా(Madhuri District) మేలూరుకు చెందిన కతిరేశన్(Kathireshan), ఆయన భార్య మీనాక్షి(Meenakshi) న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కతిరేశన్ మధురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Dhanush: Dhanush's son's legal battle has died..!

శుక్రవారం రాత్రి ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యలు తెలిపారు. కతిరేషశన్, ఆయన భార్య మీనాక్షి తమిళ్ హీరో ధనుష్ తమ కుమారుడు అంటూ 2015 మదురై హైకోర్టు బ్రాంచ్‌లో కేసు వేశారు. ఈ విషయం అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తమ కుమారుడు పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయాడని అన్నారు.

ఆ తర్వాత డైరెక్టర్ కస్తూరి రాజా ఇంటికి చేరి వారికి దత్తపుత్రుడు అయ్యాడని కోర్టులో తెలిపారు. ధనుష్ నకిలీ విద్యార్హత, బర్త్ డే సర్టిఫికేట్స్ సమర్పించాలని క్రిమినల్ యాక్షన్ ఆఫీస్ కతిరేశన్ మధురై ఆరో మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా సరైన ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్ కొట్టివేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కతిరేశన్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే కతిరేశన్ దంపతులు సమర్పించిన జనన ధృవీకరణ పత్రాల్లో నమోదు చేసిన పుట్టుమచ్చలు ధనుష్ కు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. కతిరేశన్ తరపు న్యాయవాది టైటస్ మాట్లాడుతూ.. కతిరేశన్ చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. ధనుష్ కతిరేశన్-మీనాక్షి దంపతుల కుమారుడని ఆ ప్రాంతంలో అందరికీ తెలుసని అన్నారు. అయితే ఇప్పటి వరకు ధనుష్ నిజం ఒప్పుకోలేదని తెలిపారు.

You may also like

Leave a Comment